ఆఫీస్ సబార్డినేట్ పెళ్లికి హాజరైన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి అంటే రోజుకుమ 24 గంటలు సరిపోని పదవి. రాష్ట్ర వ్యవహారాలతోపాటు అధికారుల సమన్వయం.. ఇలా ప్రతి నిముషం బిజీ,బిజీ. అయితే ఇంతటి బిజీ టైమ్లోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన చుట్టూ ఉన్నవాళ్ల మంచి, చెడులను తెలుసుకుంటూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న రవి ప్రసాద్ వివాహానికి సతీ సమేతంగా హాజరయ్యారు. తాడేపల్లి సీఎస్ఆర్ కళ్యాణమండపంలో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులను సీఎం జగన్-భారతీరెడ్డిల దంపతులు ఆశ్వీరదించారు. ఈ వివాహా వేడుకకి సీఎం దంపతులతో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తమ వివాహానికి ముఖ్యమంత్రి హాజరు కావడంపట్ల రవి ప్రసాద్తో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.