విశాఖలో వింత జాతర.. మురుగు నీరు మీద జల్లుకుంటూ

AP Visakhapatnam Burada Mamba Festival 2021 Speciality - Sakshi

విశాఖ జిల్లా దిమిలిలో నేడు బురదమాంబ సంబరం

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎక్కడాలేని రీతిలో విచిత్రంగా ఉంటుంది విశాఖ జిల్లాలోని దిమిలి బురదమాంబ జాతర. యలమంచిలి నియోజకవర్గం.. రాంబిల్లి మండల పరిధిలోని కొలువుదీరిన ఈ దిమిలి గ్రామ దేవత దల్లమాంబ అనుపు మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో బురదమాంబ అమ్మవారి జాతరను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా.. మంగళవారం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఉ.10 గంటల వరకు బురదమాంబ జాతర జరుగుతుంది.

ఇక సోమవారం అర్ధరాత్రి నుంచే జాతర కోలాహలం కనిపిస్తుంది. ఈ జాతరలో పురుషులంతా వేపకొమ్మలు చేతబూని మురుగుకాలువల్లోని బురదలో వేపకొమ్మలు ముంచి ఒకరిపై ఒకరు జల్లుకుంటూ కేరింతలు కొట్టడం ఈ జాతర ప్రత్యేకత. బురద పూసుకున్నా ఎటువంటి చర్మ వ్యాధులు సోకకుండా ఉండటం అమ్మవారి మహత్యంగా గ్రామస్తుల నమ్మకం.

అనంతరం ఆ కొమ్మలను అమ్మవారి ఆలయం వద్ద ఉంచి బురదమాంబకు పూజలు చేస్తారు. అయితే, మహిళలకు మాత్రం బురద జల్లుకోవడం నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక ఇక్కడి అమ్మవారి విగ్రహం బురదలో లభించింది కాబట్టి ఆమెను బురదమాంబగా పిలుస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top