26,778 మెడికల్‌ పోస్టుల భర్తీకి సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్

AP Govt gives green signal for replacement of 26778 medical posts - Sakshi

మెడికల్‌ ఆఫీసర్లు, స్పెషలిస్ట్‌ డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు సహా పలు పోస్టులు

నేటి నుంచే నియమించుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. 7 రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తి 

ఆగస్టు 6న విధుల్లో చేరేలా చర్యలు

సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ దిశగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వారం రోజుల్లోగా మొత్తం 26,778 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో నియామ కాలు చేపట్టడం ఇదే తొలిసారి. ఈ పోస్టులన్నింటినీ ఆగస్టు 5లోగా భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీళ్లందరినీ జూలై 30 నుంచి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా నియమించుకోవాలని సూచించింది. 

► మెడికల్‌ ఆఫీసర్లు, స్పెషలిస్టు డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లు ఇలా మొత్తం 26,778 మందిని నియమిస్తున్నారు. ఆరు నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన వీరిని నియమిస్తారు. 
► నియామకం పూర్తయిన రోజే విధుల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 
► ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటల కల్లా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఎంపికైనవారి వివరాలు పంపాలి. 

కోవిడ్‌ ఆస్పత్రుల్లో పోస్టింగులు
► స్పెషలిస్టు వైద్యుల నియామ కాల్లో పల్మనాలజీ, అనస్థీషి యా, జనరల్‌ మెడిసిన్‌ వైద్యు లకు ప్రాధాన్యం. వీళ్లు అందు బాటులో లేకపోతే ఇతరులను నియమించుకోవచ్చు.
► ట్రైనీ నర్సుల్లో ఎంఎస్సీ నర్సిం గ్‌/బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం చేసిన వారు ఉంటారు.
► కొత్తగా నియమితులైన వారికి కరోనా ఆస్పత్రుల్లోనే పోస్టింగ్‌లు
► వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ ఏర్పాటు

26,778 పోస్టులు కాకుండా ఇప్పటికే ప్రభుత్వం 2,679 పోస్టులను కరోనా వైద్య సేవల కోసం భర్తీ చేసింది. కరోనా వైద్య సేవలతోపాటు, రెగ్యులర్‌ వైద్య సేవల కోసం మరో 9,712 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. వాటి వివరాలు..

కరోనా వైద్య సేవలకు..
వారం రోజుల్లోపే నియామక ప్రక్రియ పూర్తికావాలని చెప్పాం. అభ్యర్థులకు వేతనాలు ఆశించిన స్థాయిలో ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అందుకే స్పెష లిస్టు డాక్టర్లకు నెలకు రూ.1,50,000 ఇస్తున్నాం. జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇచ్చి కలెక్టర్లు పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైనవారిని కరోనా వైద్య సేవలకు వినియోగిస్తాం.
–కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top