ఒకే రోజు 70,584 పరీక్షలు
దేశంలోనే సరికొత్త రికార్డు
తాజాగా 10,093 మందికి పాజిటివ్
సాక్షి, అమరావతి: కోవిడ్ నిర్ధారణ పరీక్షలోరాష్ట్రం మరో రికార్డు నెలకొల్పింది. దేశంలో ఇంత వరకు ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకే రోజు 70,584 మందికి పరీక్షలు నిర్వహించింది. మంగళవారం ఉ.9 గంటల నుంచి బుధవారం ఉ.9 వరకు నిర్వహించిన పరీక్షల్లో 10,093 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 18,20,009కి చేరగా, మొత్తం పాజిటివ్ కేసులు 1,20,390కి చేరాయి.
గడిచిన 24 గంటల్లో 2,784 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం బులెటిన్లో పేర్కొంది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 55,406కు చేరింది. తాజాగా 65 మంది మృతితో మొత్తం మరణాలు 1,213కి చేరాయి. యాక్టివ్ కేసులు 63,771 ఉన్నాయి.