నేడు ఏపీ కేబినేట్ సమావేశం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినేట్ గురువారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం.. గిరిజన ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవల అమలు.. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సంపూర్ణ పోషణ.. జగనన్న విద్యాకానుక పథకాలు.. గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్.. గాలేరు, నగరి నుంచి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం.. యురేనియం ప్రభావిత గ్రామాల్లో ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది.
కురుపాం గిరిజన ఇంజినీరింగ్ కాలేజీలకు పోస్టుల మంజూరుపై కేబినేట్ ఆమోదం తెలుపనుంది. పరిశ్రమలను ఆకర్షించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.