కరోనా టీకా వేయించుకున్న అంగన్‌వాడీ టీచర్‌ మృతి

Anganwadi Teacher Deceased After Corona Vaccination - Sakshi

పులివెందుల/టౌన్‌: కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న టి.నారాయణమ్మ(58) అనే అంగన్‌వాడీ టీచర్‌ గురువారం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పులివెందుల పట్టణం అహోబిలాపురంలో నివాసముంటున్న నారాయణమ్మ రెండు వారాల క్రితం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంది. వ్యాక్సిన్‌ వేయించుకున్న రెండో రోజు జ్వరం రావడంతో ఆమె ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందింది. టైఫాయిడ్‌ జ్వరంగా వైద్యులు గుర్తించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ కూడా ఆమెకు జ్వరం తగ్గకపోవడంతో గురువారం ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన గంటలోపే ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వికటించడం వల్లే ఆమె మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపించారు.
చదవండి: ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు 
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల నిర్మాణం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top