ఏపీలో కొత్తగా 458 కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 69,062కరోనా పరీక్షలు నిర్వహించగా, 458 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి గుంటూరు వాసి మృతిచెందారు. ఇప్పటివరకు కరోనాతో 7070 మంది మృతిచెందారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 534 మంది కోవిడ్నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి వరకు 1,11,34,359 శాంపిల్స్ను పరీక్షించారు.