ఏపీలో కొత్తగా 993 కరోనా కేసులు

993 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 30,851 కరోనా పరీక్షలు నిర్వహించగా, 993 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,00805 మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో 480 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,86,978 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరు, కృష్ణా, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మృతి చెందగా, ఇప్పటివరకు 7213 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 6,614 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,50,52,215 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి:
కోవిడ్‌ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్‌
మాస్కులేకుండా విధుల్లో సీఐ.. గుంటూరు ఎస్పీ ఏం చేశారంటే!

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top