ఏపీలో 10,131 మంది డిశ్చార్జ్‌

9536 Corona Positive Cases Reported In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,131 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,67,139కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఆదివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 45,99,826 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 72,233 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 9,536 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,67,123కు చేరింది. కొత్తగా 66మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 4,912కి చేరింది. ప్రస్తుతం 95,072 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top