ఏపీలో కొత్తగా 87 కరోనా కేసులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30,527 మందికి కరోనా పరీక్షలు చేయగా 87 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,88,692కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 79 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,80,678 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 853. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.