ఏపీ: 24 గంటల్లో 10,608 మంది డిశ్చార్జ్‌

7738 New Coronavirus Positive Cases Recorded In AP - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,608 మంది కరోనా వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోవిడ్‌ విజేతల సంఖ్య 5,41,319కు చేరుకుంది. నిన్న ఒక్కరోజు 70,455 శాంపిళ్లను పరీక్షించగా, 7,738 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ టెస్టుల సంఖ్య 51,04,131కు చేరుకోగా, మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,25,514కు చేరింది. ( వచ్చే మార్చి నాటికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ )

ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.ప్రస్తుతం రాష్ట్రంలో 78,836 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 57 కాగా, రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ మరణాల సంఖ్య 5,359కు చేరింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top