ఏపీలో కొత్తగా 758 కరోనా కేసులు

758 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 758 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,95,879 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్‌ నుంచి కోలుకుని 231 మంది  క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 8,85,209 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారిన పడి చిత్తూరులో ఇద్దరు.. గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మృతిచెందగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకి 7201 మరణించారు. ఏపీలో ప్రస్తుతం 3,469 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏపీలో నేటి వరకు1,48,75,597 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.


చదవండి:
విజృంభిస్తోన్న కరోనా.. 50వేలకు పైగా కేసులు
భారత్‌లో కొత్త రకం కరోనా!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top