ఏపీలో కొత్తగా 6,555 కరోనా కేసులు

6555 New Coronavirus Cases In AP Spike To 706790 - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 70,399 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..  6,555 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,06,790కి చేరింది. కరోనా నుంచి ఇవాళ కొత్తగా 7,485 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,43,993గా ఉంది. కాగా కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా 31 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5900కి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 56,897 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 59,48,534 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 11.88 శాతం ఉంది. (చదవండి : కరోనాతో 500 మంది వైద్యులు మృతి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top