ఏపీలో 73 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

3620 New Coronavirus Cases Recorded In Andhra Pradesh - Sakshi

సాక్షి,అమరావతి : ఏపీలో కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 73, 47,776 మందికి కరోనా సాంపిల్స్‌ పరీక్షించారు. కాగా గడిచిన 24 గంటల్లో 76,726 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,620 కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,96,919కి చేరింది. కరోనా నుంచి కొత్తగా 3,723 మంది డిశ్చార్జి కాగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,58,138గా ఉంది. కరోనాతో కొత్తగా 16 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,524కు చేరింది. ఏపీలో ప్రస్తుతం 32,257 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 10.85శాతం ఉండగా.. ప్రతి మిలియన్‌ జనాభాకు 1,37,599 కరోనా పరీక్షలు చేపడుతున్నారు. (చదవండి : కరోనా వ్యాక్సిన్‌పై సంచలన ప్రకటన)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top