ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 59,551 మందికి కరోనా పరీక్షలు చేయగా 357 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,80,075కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 355 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,69,124 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,862. వైరస్ బాధితుల్లో కొత్తగా నలుగురు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 7,089కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.