రాష్ట్రంలో 3,224 మందికి పాజిటివ్‌

3224 New Covid 19 Positive Cases Reported - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన నెల రోజులుగా  పాజిటివ్‌ కేసులు అత్యల్పంగా నమోదవుతున్నాయి. రోజుకు దాదాపు ఐదు వేల దాకా నమోదవుతుండగా సోమవారం ఒకేసారి రెండు వేల కేసులు పైగా తగ్గడం విశేషం. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 వరకు 61,112 మందికి పరీక్షలు నిర్వహించగా 3,224 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.

ఇప్పటి వరకు మొత్తం 66,30,728 పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,58,951కు చేరింది. ఒకే రోజు 5,504 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య  7,08,712కు చేరింది. తాజాగా 32 మంది మృతితో మొత్తం మరణాలు 6,256కు చేరాయి. ఇంకా యాక్టివ్‌ కేసులు 43,983 ఉన్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top