ఏపీ: 24 గంటల్లో 8,528 మంది డిశ్చార్జ్
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో 61,300 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా 10,621 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,93,090కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,528 మంది డిశ్చార్జ్ అవ్వగా, మొత్తం 2,95,248 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 92 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 94,209 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 34,79,990 మందికి కరోనా పరీక్షలు చేశారు.