ఏపీ: మ‌రోసారి 10 వేలు దాటిన‌ క‌రోనా కేసులు

10,128 New Coronavirus Cases In Andhra Pradesh 5th August - Sakshi

ఏపీలో ప్రస్తుతం 80,426 యాక్టివ్ కేసులు

సాక్షి, అమ‌రావ‌తి: ఆంధ‌ప్ర‌దేశ్‌లో రికార్డు స్థాయిలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు చేస్తున్నారు. దీంతో బుధ‌వారం కేసుల సంఖ్య మ‌రోసారి‌ ప‌ది వేలు దాటింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 60,576 క‌రోనా వైర‌స్‌ ప‌రీక్ష‌లు చేయ‌గా 10,128 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు వైద్యారోగ్య శాఖ బుధ‌వారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య 22,35,646కు చేరుకోగా మొత్తం కేసుల సంఖ్య 1,86,461గా న‌మోదైంది. కొత్త‌గా 8,729 మంది క‌రోనాను జ‌యించి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అవ‌గా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,04,354కు చేరింది. తాజాగా 77 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోవ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు మర‌ణించిన వారి సంఖ్య 1681కు చేరింది. ప్ర‌స్తుతం 80,426 యాక్టివ్ కేసులున్నాయి. (ఆపదలో హెల్ప్‌లైన్‌ భరోసా)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top