పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు సీఎం కృషి
● ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ
అనంతపురం క్రైం: అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ అన్నారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఆత్మార్పణతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడయ్యారన్నారు. అమరజీవి ఆశయాలకు మాజీ సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు నవ నిర్మాణ దీక్షల పేరుతో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెరమరుగు చేసే ప్రయత్నం చేశాడని గుర్తు చేశారు. పార్టీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు ఆశయాలకనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ మంజుల, డీసీసీబీ చైర్పర్సన్ లిఖిత, బీసీ కమిషన్ సభ్యుడు కిష్టప్ప, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మైనార్టీ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ గౌస్బేగ్, పార్టీ నగరాధ్యక్షురాలు కృష్ణవేణి, పలువురు కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.