జైస్వాల్‌ జోరు.. | - | Sakshi
Sakshi News home page

జైస్వాల్‌ జోరు..

Dec 7 2025 8:31 AM | Updated on Dec 7 2025 8:31 AM

జైస్వ

జైస్వాల్‌ జోరు..

భాయ్‌

రో–కో హుషారు..
సైడ్‌ లైట్స్‌

స్టేడియంలో అభిమానుల కోలాహలం

సిరీస్‌

మనదే

విశాఖ అంటేనే టీమిండియాకు ‘అచ్చొచ్చిన కోట’ అని మరోసారి రుజువైంది. సముద్ర ఘోషను మించిన అభిమానుల హర్షధ్వానాలు.. స్టేడియం నలువైపులా మార్మోగిన ‘రో–కో’ నినాదాల నడుమ భారత జట్టు కదంతొక్కింది. సిరీస్‌ విజేతను తేల్చే మ్యాచ్‌లో సమష్టి కృషితో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో.. ప్రతికూల పరిస్థితుల్లో బౌలర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పగా, యశస్వి జైస్వాల్‌ తన తొలి శతకంతో వీరవిహారం చేశాడు. కిక్కిరిసిన స్టేడియంలో రోహిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌, కోహ్లీ తనదైన క్లాసిక్‌ ఫినిషింగ్‌ ఇవ్వడంతో.. సిరీస్‌ భారత్‌ వశమైంది. కోహ్లీ, రోహిత్‌లపై అభిమానం చాటుతూ ఫ్యాన్స్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

బౌలర్ల సమయస్ఫూర్తి, బ్యాటర్ల దూకుడుతో విశాఖ వాసులకు పసందైన క్రికెట్‌ విందు లభించింది.

విశాఖలో మరోసారి రో‘హిట్‌’

సెంచరీతో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డికాక్‌

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియం టీమిండియాకు మరోసారి కలిసొచ్చింది. విశాఖ వేదికగా భారత్‌కు ఇది 8వ విజయం కావడం విశేషం.

ఎట్టకేలకు 20 వన్డేల తర్వాత భారత్‌ టాస్‌ నెగ్గింది. టీమ్‌ అనలిస్ట్‌ హరి సూచన మేరకు తాను ఎడమ చేత్తో కాయిన్‌ ఎగరేసి టాస్‌ గెలిచినట్లు కెప్టెన్‌ కె.ఎల్‌ రాహుల్‌ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

ఛేజింగ్‌లో యశస్వి జైస్వాల్‌ అదరగొట్టాడు. తన కెరీర్‌లో తొలి వన్డే సెంచరీని విశాఖలో నమోదు చేసి, జట్టు విజయానికి బాటలు వేశాడు.

రోహిత్‌ మెరుపు ఆరంభం ఇవ్వగా, చివర్లో కోహ్లీ తనదైన శైలిలో అర్ధ సెంచరీ పూర్తి చేసి, విన్నింగ్‌ షాట్‌తో మ్యాచ్‌ను, సిరీస్‌ను భారత్‌ వశం చేశాడు.

డికాక్‌ (106) సెంచరీతో దక్షిణాఫ్రికా 168/2తో పటిష్టంగా ఉన్నా.. భారత బౌలర్లు పుంజుకున్నారు. ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌ మాయాజాలంతో సఫారీలను 270 పరుగులకే కట్టడి చేశారు.

టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా పుట్టిన రోజు సందర్భంగా మైదానంలోనే జట్టు సభ్యులు సంబరాలు జరిపారు.

రోహిత్‌, కోహ్లీపై అభిమానంతో ఫ్యాన్స్‌ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ‘రో–కో’ నినాదాలతో స్టేడియం హోరెత్తింది.

మ్యాచ్‌ జరుగుతుండగా ప్రేక్షకులంతా తమ సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌ లైట్లు ఆన్‌ చేసి స్టేడియంలో సరికొత్త కాంతులు నింపారు.

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌, జీవీఎంసీ సహకారంతో ఏర్పాటు చేసిన ‘ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్‌’ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌ తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచే అభిమానులు స్టేడియం వద్దకు పోటెత్తారు. టికెట్‌ ఉన్న వారిని మాత్రమే అనుమతించేలా పోలీసులు పటిష్టమైన బారికేడ్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు.

– విశాఖస్పోర్ట్స్‌/ పీఎంపాలెం

– విశాఖ స్పోర్ట్స్‌

జైస్వాల్‌ జోరు.. 1
1/11

జైస్వాల్‌ జోరు..

జైస్వాల్‌ జోరు.. 2
2/11

జైస్వాల్‌ జోరు..

జైస్వాల్‌ జోరు.. 3
3/11

జైస్వాల్‌ జోరు..

జైస్వాల్‌ జోరు.. 4
4/11

జైస్వాల్‌ జోరు..

జైస్వాల్‌ జోరు.. 5
5/11

జైస్వాల్‌ జోరు..

జైస్వాల్‌ జోరు.. 6
6/11

జైస్వాల్‌ జోరు..

జైస్వాల్‌ జోరు.. 7
7/11

జైస్వాల్‌ జోరు..

జైస్వాల్‌ జోరు.. 8
8/11

జైస్వాల్‌ జోరు..

జైస్వాల్‌ జోరు.. 9
9/11

జైస్వాల్‌ జోరు..

జైస్వాల్‌ జోరు.. 10
10/11

జైస్వాల్‌ జోరు..

జైస్వాల్‌ జోరు.. 11
11/11

జైస్వాల్‌ జోరు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement