అహీర్‌ రెజిమెంట్‌ ఏర్పాటు కోసం యాత్ర | - | Sakshi
Sakshi News home page

అహీర్‌ రెజిమెంట్‌ ఏర్పాటు కోసం యాత్ర

Jul 12 2025 8:14 AM | Updated on Jul 12 2025 10:07 AM

అహీర్‌ రెజిమెంట్‌ ఏర్పాటు కోసం యాత్ర

అహీర్‌ రెజిమెంట్‌ ఏర్పాటు కోసం యాత్ర

కె.కోటపాడు : భారత సైన్యంలో అహీర్‌(యాదవ) రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అఖిత భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రెజంగలా పవిత్ర కలశ యాత్రను నిర్వహిస్తున్నట్లు మహాసభ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్‌.మహేశ్వరియాదవ్‌ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 13న బిహార్‌లో ప్రారంభమైన ఈ యాత్ర కె.కోటపాడు మీదుగా అనకాపల్లి వైపు శుక్రవారం సాగింది. అఖిల భారత ఉత్తరాంధ్ర జోన్‌ కన్వీనర్‌ పల్లా రాజేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కె.కోటపాడులో ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మహేశ్వరియాదవ్‌ మాట్లాడుతూ 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో 120 మంది అహీర్‌ వీర సైనికులు పోరాటం చేసి లడక్‌ చుగుల్‌ హైర్‌ పీల్డును కాపాడారన్నారు. ఈ యుద్ధంలో 114 మంది అహీర్‌ వీరులు(యాదవ) వీర మరణం పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర నాయకులు ఆంజనేయమూర్తి యాదవ్‌, బొట్టా రామారావు, దూళి రంగనాయకులు యాదవ్‌, మునిస్వామి యాదవ్‌, షేశపాణియాదవ్‌, పల్లా రామమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement