
ఏపీఐఐసీ భూములు పరిశీలించిన బీడీఎల్ ప్రతినిధులు
బీడీఎల్ ప్రతినిధులతో మాట్లాడుతున్న తహసీల్దార్ వెంకటరమణ
మాకవరపాలెం: ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న భూములను మంగళవారం భారత్ డైనమిక్ లిమిటెడ్(బీడీఎల్) ప్రతినిధులు పరిశీలించారు. మండలంలోని రాచపల్లి రెవెన్యూలో 300 ఎకరాల భూమి ఏపీఐఐసీ ఆధీనంలో ఉంది. దీనిని పరిశ్రమల స్థాపనకు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బీడీఎల్ ప్రతినిధులు రా మన్నపాలెం ప్రాంతంలో ఉన్న భూముల్లో పర్యటించారు. వారికి స్థానిక తహసీల్దార్ వెంకటరమణ భూముల వివరాలను తెలియజేశారు. విశాఖ–నర్సీపట్నం ప్రధాన రహదారి నుంచి ఈ భూముల్లోకి వెళ్లే రహదారులను కూడా పరిశీలించారు.