
ఎస్పీ కార్యాలయానికి 35 అర్జీలు
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, మోసాలు, వంటి వాటిపై అర్జీలు వచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్ఐ డి.వెంకన్న, అర్జీదారులు పాల్గొన్నారు.