బీఎన్‌ రోడ్డులో చేపల వేటతో నిరసన | - | Sakshi
Sakshi News home page

బీఎన్‌ రోడ్డులో చేపల వేటతో నిరసన

Jul 1 2025 4:10 AM | Updated on Jul 1 2025 4:10 AM

బీఎన్‌ రోడ్డులో చేపల వేటతో నిరసన

బీఎన్‌ రోడ్డులో చేపల వేటతో నిరసన

బీఎన్‌ రోడ్డులో వలతో చేపలు పడుతూ నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు, ప్రజలు

రోలుగుంట: స్థానిక నర్సీపట్నం – భీమిలి ఆర్‌అండ్‌బీ రోడ్డు దుస్థితిపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీపీఎం నాయకులు కె.గోవింద, ఇ.చిరంజీవిల ఆధ్వర్యంలో సోమవా రం స్థానిక మండల కార్యాలయ సముదాయం కూడలి సమీపంలో చెరువును తలపిస్తున్న రోడ్డు గుంతలో వలతో చేపల పడుతూ తమ నిరసన తెలిపారు. సీపీఎం నాయకుడు మాట్లాడుతూ ఈ గోతుల రోడ్డులో రాకపోకలు చేసే వాహనదారులు అదుపు తప్పి బోల్తాపడి గాయాల పాలవుతున్నారన్నారు. కొవ్వూరు, కె.నాయుడుపాలెం, పాపంపేట, అంట్లపాలెం తదితర గ్రామాల నుంచి గర్భిణులను గాని, క్షతగాత్రులను గాని 108 వాహనంలో తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ రోడ్డు మెరుగుపరచి రవాణా కష్టాలు తీరుస్తామని బూట కపు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి ఏడాదైనా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వాన్ని దూషించిన ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు ఇప్పుడు ఏం చేస్తున్నారు.. నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement