పరిహారాన్ని నగదు రూపంలో ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

పరిహారాన్ని నగదు రూపంలో ఇవ్వాలి

Jun 30 2025 4:05 AM | Updated on Jun 30 2025 4:05 AM

పరిహారాన్ని నగదు రూపంలో ఇవ్వాలి

పరిహారాన్ని నగదు రూపంలో ఇవ్వాలి

అచ్యుతాపురం: అచ్యుతాపురం–అనకాపల్లి రోడ్డు విస్తరణ బాధితులకు నగదు రూపంలో పరిహారాన్ని ఇవ్వాలని, టీడీఆర్‌ల రూపంలో వద్దని రోడ్డు విస్తరణ నిర్వాసితుల సంఘం క న్వీనర్‌ ఆర్‌.రాము డిమాండ్‌ చేశారు. ఆదివా రం మండల కేంద్రం అచ్యుతాపురంలో వారు నిర్వాసితుల తరఫున నిరసన వ్యక్తం చేసి, నినాదాలు చేశారు. రోడ్డు విస్తరణలో కోల్పోతున్న భూములు, ఇళ్లు, దుకాణాలకు తక్కువ మార్కెట్‌ ధర చూపిస్తున్నారని, ఇది అన్యాయమన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్ర మంలో బ్రహ్మాజీ, కర్రి అప్పారావు, రామ సదాశివరావు, ఎస్‌.కనుమనాయుడు, బుద్ధ రంగారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement