34 కిలోల గంజాయి స్వాధీనం
● ఆరుగురు నిందితుల అరెస్ట్
మారేడుమిల్లి: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని మారేడుమిల్లి పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రాము వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్, మల్కన్గిరికి చెందిన మహ్మద్ సజ్జాద్, రాహుల్ కుమార్ మిశ్రా, రాహుల్ బత్రా, మంటూ సర్ధార్, పంకజ్ మండల్, గురచంద్ మండల్ రెండు ద్విచక్ర వాహనాలపై దారకొండ నుంచి గంజాయిని రాజమహేంద్రవరానికి తరలిస్తుండగా, స్థానిక జీఎంవలస జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 34 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రెండు బైకులు, ఆరు సెల్ఫోన్లు సీజ్ చేశారు. మరో నిందితుడు కిలో రాజేష్ పరారీ అయ్యాడు. పట్టుకున్న గంజాయి విలువ రూ.లక్ష ఉంటుందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.