నేడు విద్యుత్‌ టారిఫ్‌ ఉత్తర్వులు

సాక్షి, విశాఖపట్నం: 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్‌ చార్జీల ఉత్తర్వులను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణా మండలి (ఏపిఈఆర్‌ సీ) చైర్మన్‌ జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి శనివారం విడుదల చేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు పేర్కొన్నారు. సీతమ్మధారలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంలో ఏటీసీ భవన కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఈఆర్‌సీ సభ్యులు ఠాకూర్‌ రామ్‌ సింగ్‌, పి.రాజగోపాల్‌ రెడ్డిలతోపాటు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలు కె.సంతోషరావు (ఏపీఈపీడీసీఎల్‌, ఏపీఎస్పీడీసీఎల్‌), జె.పద్మాజనార్దన్‌ రెడ్డి (ఏపీసీపీడీసీఎల్‌) పాల్గొంటారని పేర్కొన్నారు.




 

Read also in:
Back to Top