కునుకూరు హెచ్‌ఎం గుండెపోటుతో మృతి

సత్తిబాబు (ఫైల్‌) - Sakshi

కొయ్యూరు: మండలంలో బూదరాళ్ల పంచాయతీ కునుకూరు మండల పరిషత్‌ పాఠశాల హెచ్‌ఎం పాతర సత్తిబాబు (46) గుండెనొప్పితో శుక్రవారం స్వగ్రామంలో ఇంటి వద్దనే మృతి చెందారు. గుండెనొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను 108లో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అప్పటికే ఆయన మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే ఎంపీపీ బడుగు రమేష్‌, వైస్‌ ఎంపీపీ అంబటి నూకాలు, చీడిపాలెం సర్పంచ్‌ ఎన్‌ సోమన్నదొర, రాజేంద్రపాలెం సర్పంచ్‌ పి సింహాచలం (సింహాద్రి) కుటుంబాన్ని పరామర్శించారు. ఎంఈవో బోడంనాయుడు సంతాపం తెలిపారు.




 

Read also in:
Back to Top