రైతుల డాక్యుమెంట్లు పరిశీలన
రైతుల డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న సబ్కలెక్టర్ శుభం బన్సల్
చింతూరు: భద్రాచలం నుంచి చట్టి వరకు జరుగుతున్న జాతీయ రహదారి–30 విస్తరణ పనుల్లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించి డాక్యుమెంట్లను రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సాల్ శుక్రవారం చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో పరిశీలించారు. విస్తరణలో భాగంగా చింతూరు మండలంలో సరివెల, సింగన్నగూడెం, గంగన్నమెట్ట, ఏడుగురాళ్లపల్లి గ్రామాల్లో 33 మంది రైతులకు చెందిన భూములు కోల్పోతున్నారు. వారికి నష్టపరిహారం అందించేందుకు గాను రైతులకు సంబంధించిన భూముల ఆధారాలు పరిశీలించిన సబ్ కలెక్టర్ 14 మంది ఆధారాలు సరిగ్గా ఉన్నట్టు నిర్థారించారు. మిగతా 19 మంది తమ భూముల డాక్యుమెంట్లను పక్కా ఆధారాలతో తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. అనంతరం ఆయన ఏడుగురాళ్లపల్లిలో రైతుల భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సాయికృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.