రేషన్‌కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి

సచివాలయంలోని సిబ్బందికి సూచనలు చేస్తున్న జిల్లా పౌరసరఫరాల అధికారి శివప్రసాద్‌   - Sakshi

● జిల్లా పౌరసరఫరాల అధికారి శివప్రసాద్‌

సాక్షి, పాడేరు: రేషన్‌కార్డుదారులందరికీ తప్పనిసరిగా ఈకేవైసీ చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి శివప్రసాద్‌ సూచించారు. శుక్రవారం ఆయన సుండ్రుపుట్టు సచివాలయాన్ని సందర్శించారు. వలంటీర్లు, సచివాలయం డిజిటల్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. సకాలంలోని లబ్ధిదారులకు సేవలందించాలన్నారు. జిల్లాలోని 70 సచివాలయాల్లో ఆధార్‌ అఫ్డేట్‌ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.




 

Read also in:
Back to Top