గంజాయి నిందితులపై ప్రత్యేక నిఘా

అనకాపల్లిటౌన్‌: గంజాయి కేసుల్లో బెయిల్‌పై వచ్చిన నిందితుల మీద ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ గౌతమిసాలి అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నెలవారీ నేరసమీక్ష నిర్వహించారు. గంజాయి కేసుల్లో దర్యాప్తు పెండింగ్‌లో ఉండడానికి గల కారణాలపై ఆరా తీశారు. గంజాయి రవాణా చేసేవారితోపాటు వారికి సహాయం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. అంతకుముందు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేసి, సత్కరించారు. అదనపు ఎస్పీలు బి.విజయభాస్కర్‌, పి.సత్యనారాయణరావు, అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం ఇన్‌చార్జి డీఎస్పీలు మళ్ల మహేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, కె.ప్రవీణ్‌కుమార్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, సీఐలు దాడి మోహనరావు, చంద్రశేఖర్‌, లక్ష్మణ్‌మూర్తి, అప్పలనాయుడు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top