ఐఐఎం విద్యార్థులందరికీ ఇంటర్న్‌షిప్‌

ఇంటర్న్‌షిప్‌ సాధించిన విద్యార్థులు - Sakshi

ఏయూక్యాంపస్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విశాఖపట్నం విద్యార్థులకు శతశాతం సమ్మర్‌ ప్లేస్‌మెంట్స్‌ లభించాయి. అత్యధిక స్టైఫండ్‌గా రెండు నెలలకు రూ 2.5లక్షలు సాధించారు. సగటు స్టైఫండ్‌ రూ.79.88 వేలు. 110 సంస్థలకు మొత్తం 272 మంది విద్యార్థులూ ఎంపికయ్యారు. ఐటీ ఆధారిత రంగాలకు 22 శాతం, ఎఫ్‌ఎస్‌ఐ రంగాలకు 19 శాతం, కన్సెల్టింగ్‌లో 12 శాతం, ఎఫ్‌ఎంసీజీలో 8 శాతం, మ్యానుఫ్యాక్చరింగ్‌లో 7 శాతం, ఫార్మా–హెల్త్‌కేర్‌ రంగంలో 7 శాతం, ఎడ్యుటెక్‌ రంగంలో 7శాతం, రియల్‌ ఎస్టేట్‌–నిర్మాణ రంగంలో 4 శాతం మంది నియామకం అయినట్లు ఐఐఎంవీ సంచాలకుడు ఆచార్య ఎం.చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు.




 

Read also in:
Back to Top