వచ్చే నెల 30 నుంచి మత్స్యమాడుగులమ్మ ఉత్సవాలు

ఉత్సవ ఏర్పాట్లపై సమావేశమైన పెద్దలు  - Sakshi

జి.మాడుగుల: ఏజెన్సీ ప్రజల ఆరాధ్యదైవం, మత్స్యరాస వంశీయుల ఇలవేల్పు మత్స్యమాడుగులమ్మ జాతర మహోత్సవాలు వచ్చేనెల 30 నుంచి మే రెండో తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఉత్సవ కమిటీని శనివారం ఏర్పాటుచేస్తామని గురువారం ఆలయ ఆవరణలో గ్రామస్తులు, వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మత్స్యరాస వరహాలరాజు, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు, ఎం రామరాజు, ఉపాధ్యాయుడు ఎం.భగవాన్‌రాజు, జీసీసీ సేల్స్‌మేన్‌ ఎం సింహాచలంరాజు, ఎం రామూర్తిరాజు, గసాడి రెడ్డిబాబు, కల్యాణం, అలీఖాన్‌, వడ్డాది శ్రీనివాసరావు, రిటైర్డు ఉద్యోగి తలారి మత్స్యయ్య, గణపతి, కొండబాబు పాల్గొన్నారు.




 

Read also in:
Back to Top