ఘాట్ రోడ్డులో అడ్డంగా నిలిచిన లారీ
రాకపోకలకు అవస్థలు
సాక్షి,పాడేరు: మైదాన ప్రాంతానికి వెళ్లే ప్రధాన ఘాట్రోడ్డులోని యేసు ప్రభువు విగ్రహం ఉన్న మలుపులో భారీ లారీ మళ్లీ సాంకేతిక కారణాలతో రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. మైదాన ప్రాంతం నుంచి లోడ్తో వస్తున్న భారీ వాహనం ఈ మలుపు ఎక్కలేక మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మొరాయించి ఆగిపోయింది. బస్సులు, లారీలు, భారీ వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. కార్లు, జీపులు, ఆటోలు మాత్రమే రాకపోకలు సాగించాయి. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ అధికారులు ఇరువైపులా బస్సులను నిలిపి ప్రయాణికులను తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీని అడ్డంగా తీసే పనులు కొనసాగుతున్నాయి.