నేడు సెలబ్రిటీ క్రికెట్ సెమీస్ మ్యాచ్లు
విశాఖ స్పోర్ట్స్: సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) సెమీస్ ఫైనల్ పోటీలు శుక్రవారం వైఎస్సార్ స్డేడియంలో జరగనున్నాయి. తొలి సెమీస్ మధ్యాహ్నం 2.30 గంటలకు భోజ్పురి దంబాగ్–ముంబై హీరోస్ జట్ల మధ్య జరగనుంది. మరో సెమీస్లో రాత్రి 7 గంటలకు కర్నాటక బుల్డోజర్స్ జట్టుతో తెలుగు వారియర్స్ జట్టు తలపడనుంది. ఫైనల్స్ శనివారం రాత్రి 7 గంటలకు ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగనుంది. తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్గా అఖిల్, మెంటర్గా వెంకటేష్ వ్యవహరించనున్నారు. అంబాసిడర్లుగా రెజీనా, ప్రణిత, ఆదాశర్మ ఉన్నారు. జట్టులో సచిన్జోషి, అశ్విన్, ధరమ్, ఆదర్స్, నిఖిల్, తరుణ్, విశ్వ, ప్రిన్స్, సుశాంత్ ఆల్రౌండర్లుగా రాణిస్తుండగా నంద, సామ్రాట్ బంతితో అలరించనున్నారు. టీ20 మ్యాచ్ అయినా తొలిసారిగా పదేసి ఓవర్లు రెండు ఇన్నింగ్స్లుగా పోటీలు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్లు జీటీవీ ప్రసారం చేయనుంది.