27న నిధి ఆప్కే నికత్
రాజమహేంద్రవరం రూరల్: ఉద్యోగులు భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 27న నిధి ఆప్కే నికత్–జిల్లా ఔట్రీచ్ ప్రోగ్రాం జరగనుంది. పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ వైడీ శ్రీనివాస్ ఈ విషయం తెలిపారు. పూర్వ ఉభయ గోదావరి జిల్లాల ఖాతాదారులు ఈసేవలు వినియోగించుకోవచ్చునన్నారు. భవిష్యనిధి అంతిమ ఉపసంహరణ, ఖాతాల బదిలీ తదితర అంశాలకు సంబంధించి పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. తూర్పుగోదావరిజిల్లా పరిధిలో పెద్దాపురంలో శ్రీలలితా ఎంటర్ప్రైజస్ ఇండస్ట్రీస్ (ప్రై)లిమిటెడ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వేదాంత లిమిటెడ్, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజ్మెంట్ రిసోర్స్సెంటర్, కాకినాడ జిల్లా పరిధిలో కాకినాడ ఈపీఎఫ్వో జిల్లా కార్యాలయం, ఏలూరు జిల్లా పరిధి ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ కాలేజ్ ఆడియో విజువల్ హాల్, పశ్చిమగోదావరి జిల్లా పరిధి భీమవరం ఈపీఎఫ్వో జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పెన్షన్ అర్హత, లెక్కించడం, క్లెయిమ్, ఉపసంహరణ, స్కీమ్ సర్టిఫికెట్, ఈ నామినేషన్, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, ఇతర సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈపీఎఫ్వో సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్మెంట్లు, కొత్తగా కవర్ చేసిన ఎస్టాబ్లిష్మెంట్లు ఈఅవుట్రీచ్ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోవాలని సూచించారు. నిధి అప్కే నికత్ అని పేర్కొంటూ తమ ఫిర్యాదులను అందజేయవచ్చని అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ వైడీ శ్రీనివాస్ కోరారు.
పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ వైడీ శ్రీనివాస్