సముద్ర తీరం.. పరిశుభ్రం
‘సాక్షి’మీడియా ఆధ్వర్యంలో ఆర్.కె.బీచ్ క్లీన్
బీచ్రోడ్డు: ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి.. పర్యారణాన్ని కాపాడుకుందామని ‘సాక్షి’మీడియా విశాఖపట్నం బ్రాంచ్ మేనేజర్ బి.వి.ఎస్.ఎస్.చంద్రరావు పిలుపునిచ్చారు. ‘సాక్షి’పత్రిక 15వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఆర్కేబీచ్లో బీచ్ క్లీన్ కార్యక్రమం జరిగింది. ఎడిటోరియల్, రిపోర్టింగ్, అడ్మినిస్ట్రేటివ్, యాడ్స్, సర్క్యులేషన్, టీవీ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది బీచ్రోడ్డులోని కాళీమాత ఆలయం ఎదురుగా ఆర్.కె.బీచ్లో చెత్త, వ్యర్థాలను ఏరివేసి.. జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందజేశారు. పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖ నగరాన్ని పరిశుభ్రం ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న ‘సాక్షి’ సిబ్బంది