‘టెన్త్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం’
అనకాపల్లిటౌన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థులు వారి స్వగృహం నుంచి పరీక్షా కేంద్రం వరకూ హాల్ టికెట్స్ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ) అధికారిణి కె.పద్మావతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని డిపోల్లో విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు.
పరీక్ష సమయంలో మాత్రమే విద్యార్థులు హాల్టికెట్ చూపించి ఆర్టీసీ బస్లో ప్రయాణించవచ్చన్నారు.