ఘనంగా గండి పోశమ్మ జాతర ప్రారంభం

- - Sakshi

దేవీపట్నం: పూడిపల్లి పంచాయతీ గొందూరులో కొలువైన మాతృశ్రీ గండిపోశమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు గరగల నృత్యం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి జాతరను తిలకించేందుకు సుమారు వెయ్యిమంది భక్తులు హాజరయ్యారు. వచ్చిన వారందరికీ ఆలయ సిబ్బంది అన్నసమారాధన ఏర్పాటుచేశారు. ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్ర సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించారు. ఐదు రోజులపాటు నిర్వహించే ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో జి.వి లక్ష్మీకుమార్‌ తెలిపారు.




 

Read also in:
Back to Top