జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికై న విద్యార్థులు  - Sakshi

● ముగ్గురు విద్యార్థులకు అభినందనలు

పాయకరావుపేట: కృష్ణా జిల్లా గన్నవరంలో జనవరి 13, 14వ తేదీల్లో జరిగిన 37వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బాలుర పోటీల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు శ్రీప్రకాష్‌ విద్యా సంస్థల సీనియర్‌ ప్రిన్సిపాల్‌ ఎం.వి.వి.ఎస్‌ మూర్తి గురువారం తెలిపారు. శ్రీప్రకాష్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు రాజాన కుమార్‌, లాలం దిలీప్‌, దొండా రేవంత్‌ ఈ నెల 27 నుంచి 31 వరకు అసోం రాష్ట్రం గౌహతిలో జరిగే 37వ జాతీయ స్థాయి సబ్‌ జూనియర్స్‌ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. వీరిని విద్యా సంస్థల అధినేత సిహెచ్‌.వి.కె. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్‌ ప్రకాష్‌, ప్రధానోపాధ్యాయుడు డి.వి. శ్రీనివాస్‌, కోచ్‌లు సురేష్‌, బాలరాజు, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.




 

Read also in:
Back to Top