సీఎం రేవంత్రెడ్డి పర్యటన ఖరారు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో బహిరంగసభ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
కైలాస్నగర్: సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకోసం ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో శిలాఫలకాలను సిద్ధం చేస్తున్నారు. అనంతరం అక్కడే బహిరంగసభ నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, కాన్వాయ్ మార్గం సభ వేదిక, పోలీస్ బందోబస్తు, పార్కింగ్, వేదికపై అతిథుల సిట్టింగ్ వంటి ఏర్పాట్లపై అధికారులతో చర్చించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శ్యామల దేవి, రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.
ఽశంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు
సీఎం పర్యటన సాగుతుందిలా..
మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్లో బయలుదేరి 2గంటలకు జిల్లా కేంద్రంలోని ఎరోడ్రమ్లోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2.10 గంటలకు ఏఆర్ హెడ్క్వార్టర్స్కు చేరుకుంటారు. 2.10 నుంచి 2.35 వరకు పోలీస్ క్వార్టర్స్, భరోసా సెంటర్ను ప్రారంభిస్తారు. 2:35కు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకుంటారు. 2:40 వరకు శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 3.55 గంటలకు హెలిప్యాడ్కు బయలుదేరుతారు.
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్నగర్: ఈ నెల 4న జరిగే సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం చేసేలా అన్ని ఽశాఖల అధికారులు సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వవద్దన్నారు. స్టేజ్ ఏర్పాటు, వైద్య శిబిరం, పారిశుధ్యం, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలన్నారు. పర్యటన రోజున అధికారులు క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయాలన్నారు.


