టెట్కు 93 మంది గైర్హాజరు
ఒంగోలు: జిల్లాలోని మూడు సెంటర్లలో నిర్వహించిన టీచర్స్ ఎలిజిబులిటీ టెస్టు(టెట్)కు సోమవారం 93 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 390 మందికిగాను 53 మంది, సాయంత్రం 395 మందికిగాను 40 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర ప్రకటించారు. పరీక్షలు పూర్తి ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు తెలిపారు.
సేంద్రియ ఉత్పత్తులకు ప్రాధాన్యం
ఒంగోలు అర్బన్: ఎటువంటి రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన కూరగాయలు ఇతర ఉత్పత్తులకు ప్రాధాన్యం లభించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. సోమవారం ప్రకాశం భవనంలో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఇతర ఉత్పత్తుల కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. స్వయంగా కూరగాయలు కొనుగోలు చేశారు.
టెట్కు 93 మంది గైర్హాజరు
టెట్కు 93 మంది గైర్హాజరు


