లోకల్ టు గ్లోబల్: ఫొటో స్టోరీస్
ఈ కష్టం తీరేదెప్పుడో.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కరోనా టీకా కోసం ఆరోగ్య కేంద్రం ఎదుట అవస్థలు పడుతున్న ప్రజలు
ఈ పడిగాపులు తప్పేదెన్నడో.. కాన్పూర్లో ప్రాణ వాయువు కోసం ఆక్సిజన్ ఫిల్లింగ్ సెంటర్ ఎదుట పడిగాపులు కాస్తున్న జనం
కరోనా కాలం: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేక కారులోనే చికిత్స తీసుకుంటున్న కరోనా బాధితుడు
కొత్తపేట రైతు బజార్లో కిటకిట: అదే నిర్లక్ష్యం.. అదే వరస.. మోగుతున్న మృత్యుఘంటికలు.. అయినా జనం తీరు మారడం లేదు.
మన్సూరాబాద్ పీహెచ్సీ వద్ద టీకా కోసం బారులు.. కరోనా సెకండ్వేవ్ విజృంభణతో కోవిడ్ టీకా వేయించుకునేందుకు ఆరోగ్య కేంద్రాలకు జనం పోటెత్తుతున్నారు.
థ్యాంక్స్ ‘గాంధీ’: మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ మహిళ కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుంది. ఊరికి తిరిగి వెళ్తూ.. తన ప్రాణం నిలిపిన వైద్యులను స్మరిస్తూ.. ఆస్పత్రికి చేతులెత్తి మొక్కింది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
అయ్యో.. కొడుకా..!: కరోనా భయంతో నిజామాబాద్ జిల్లా రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మృతిచెందిన కుమారుడిని పట్టుకొని రోదిస్తున్న తల్లి
పసిడి కాంతులు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలోని అష్టభుజి ప్రాకార మండపం, బాహ్య ప్రాకార మండపాల్లో అధునాతన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఆళ్వార్ మండపం పైభాగంలో గల కాకతీయ పిల్లర్లకు పసిడి రంగులో ఉన్న విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంటోంది.
కరోనా కల్లోలం: దేశంలో కోవిడ్ పరిస్థితికి అద్దం పడుతున్న దృశ్యం ఇది. రాంచీలో కోవిడ్ కారణంగా మరణించిన వారిని స్వర్ణరేఖ ఘాట్ క్రిమేటరీ వద్ద ఇలా సామూహిక దహనం చేశారు.
అంతులేని ఆవేదన: ఢిల్లీలోని ఆసుపత్రిలో కోవిడ్ బాధితుడు మృతి చెందడంతో బయట రోదిస్తున్న అతడి బంధువు
‘మహమ్మారి’ మంటలు: కరోనా వల్ల మరణించినవారి మృతదేహాలను ఢిల్లీలోని ఓ శ్మశాన వాటికలో దహనం చేస్తున్న దృశ్యం
రోబో జాగిలం: అచ్చం కుక్కలా పని కదలికలను చూపించే ఈ రోబోను జర్మనీకి చెందిన సిబోరియస్ కంపెనీ తయారు చేసింది. పోలీసులు ఉపయోగించే జాగిలాల స్థానంలో వీటిని ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే ఈ రోబో 360 డిగ్రీల కోణంలో చూడగల కెమెరా ఉంది. దాంతో పాటు పలు లైట్ డిటెక్షన్ సిస్టం కూడా దీనిలో పొందుపరచారు.
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్