టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములను టీడీపీ నాయకులు వదిలేట్టు కనబడటం లేదు. ఆరంభం నుంచి ఈ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు కుట్రలు చేసిన అధికార పార్టీ నాయకులు తాజా వేలంలోనూ తమ 'పాటవం' ప్రదర్శించారు. తమ అనుచరుడి ద్వారా సత్రం భూములను దక్కించుకున్నారు. రెండోసారి నిర్వహించిన వేలంలోనూ భూములు చేజారిపోకుండా చక్రం తిప్పారు. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రసాబాసగా మారింది. క్యూ లైన్లలో తలెత్తిన వివాదం.. ఒకరినొకరు సిగలు పట్టుకుని చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది. మరిన్ని వార్తలు మీకోసం..
<<<<<<<<<<<<<<<< రాష్ట్రీయం >>>>>>>>>>>>>>>>>
మళ్లీ చక్రం తిప్పిన 'పచ్చ' బ్యాచ్!
సదావర్తి సత్రం భూములను టీడీపీ నాయకులు వదిలేట్టు కనబడటం లేదు.
బతుకమ్మ చీరలు: కొట్టుకున్నమహిళలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రసాబాసగా మారింది.
'మేము చెబుతున్నదే ఇవాళ జరిగింది'
సదావర్తి సత్రం భూముల వేలంకు అనూహ్య స్పందన లభించడం శుభపరిణామని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.
నంద్యాల ఉప ఎన్నిక.. సంచలన నిజాలు!
నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సంచలన నిజాలు బయటపెట్టారు.
సదావర్తి భూములను దక్కించుకున్న సత్యనారాయణరెడ్డి
చౌకగా సదావర్తి సత్రం భూములను తన అనుయాయులకు కట్టబెట్టాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ కుట్రకు బ్రేక్ పడింది.
<<<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>
రోహింగ్యాల అంశం.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
వివాదాస్పదంగా మారిన రోహింగ్యా ముస్లింల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ...
మాయావతి సంచలన వ్యాఖ్యలు
బీఎస్పీ అధినేత్రి మాయావతి మోదీ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోవా పర్యాటకులకు చేదు వార్త
చాలా మంది చాలాసార్లు గోవాకు వెళ్లాలని అనుకొని ఉంటారు.
<<<<<<<<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>>>>>>>>>>
బెటర్ బీర్ ఫెస్టివల్ రద్దు
ఏడాదికోసారి కౌలాంపూర్లో జరిగే క్రాఫ్ట్ బీర్ ఫెస్టివల్ రద్దయింది.
యువతులపై యాసిడ్ దాడి.. ఉగ్రచర్య కాదు
నలుగురు అమెరికన్ విద్యార్థినిలపై యాసిడ్ దాడికి పాల్పడిన మహిళను తొలుత ఉగ్ర దాడిగా...
షరీఫ్ భార్య.. ఘన విజయం
అవినీతి ఆరోపణలతో పదవీచిత్యుడు అయిన పాక్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్కు పెద్ద ఊరట
<<<<<<<<<<<<<<<< బిజినెస్ >>>>>>>>>>>>>>>>>
భారీ క్యాష్ బ్యాక్, లక్కీ విన్నర్స్కి ఐ ఫోన్ ఫ్రీ..
ఈ ప్లాట్ఫాం పేటీఎం మాల్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.
మాల్యాకు రూ.100కోట్ల షాక్
వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.
రెడ్ మి నోట్ 5 ఏ లాంచ్..ఫీచర్లు?
ప్రముఖ చైనా మొబైల్ మేకర్ షావోమి రెడ్మి నోట్ 5ఏ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ కొత్త వెర్షన్ ప్రారంభించింది.
ఇక రోజువారీ పరిమితి రూ.25వేలు
డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే చర్యలో భాగంగా దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఫండ్ ట్రాన్సఫర్ పరిమితులను పెంచింది.
<<<<<<<<<<<<<<<< క్రీడలు >>>>>>>>>>>>>>>>>
కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ధోని.. ఈసారి ఎయిర్ పోర్ట్‑లో!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సేద తీరాలంటే చుట్టు ఉన్న పరిస్థితుల్ని పెద్దగా పట్టించుకోడనే విషయం మరోసారి రుజువైంది.
నీకేమైనా బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా?
ఆస్ట్రేలియన్లు గెలుపు కోసం ఏమైనా చేస్తారు.
<<<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>
స్పైడర్ ఎలా ఉందంటే..
'స్పైడర్'తో సూపర్స్టార్ మహేశ్ బాబు మరో బ్లాక్బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకుడు, సెన్సార్బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు.
మూడోరోజు కలెక్షన్స్.. ఇంకాస్తా పెరిగాయ్!
నిత్యం వివాదాల్లో నిలిచే బాలీవుడ్ తార కంగన రనౌత్ తాజా సినిమా 'సిమ్రన్'..
ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్
యంగ్టైగర్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నగరంలో సందడి చేశారు.