నితీశ్ ప్రమాణానికి సోనియా, మమత, కేజ్రీ

నితీశ్ ప్రమాణానికి సోనియా, మమత, కేజ్రీ - Sakshi


పట్నా: బిహార్ సీఎంగా నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ సీఎంలు  కేజ్రీవాల్, మమతా బెనర్జీసహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రమాణం ఈ నెల 20వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం హాజరవుతున్నారు. ఒడిశా, అస్సాం, యూపీల సీఎంలు నవీన్ పట్నాయక్, తరుణ్ గొగోయ్, అఖిలేశ్ యాదవ్‌లూ పాల్గొననున్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్‌లు ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నారు. బీజేపీని వ్యతిరేకించే అగ్ర నేతలందరూ ఒకచోటకు చేరి తమ ఐక్యతను చాటనున్నారని  జేడీయూ ప్రధాన కార్యదర్శి కె.సి.త్యాగి అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top