సింగరేణికి రూ.491 కోట్ల లాభాలు
గోదావరిఖని: సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.491 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. శుక్రవారం హైదరాబాద్లోని సిం గరేణి భవన్లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు, అధికారుల సంఘం ప్రతినిధులతో జరిగిన జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ (జేసీసీ) సమావేశంలో సీఎండీ ఎన్.శ్రీధర్ ఈ విషయాన్ని ప్రకటించారు. సింగరేణిలోని 62 వేల మంది కార్మికులు, ఉద్యోగులు 52.50 మిలి యన్ టన్నుల బొగ్గును వెలికితీసి రూ.14,083 కోట్ల వ్యాపారం నిర్వహించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సింగరేణిలో కార్మికులకు లాభాల్లో వాటా చెల్లిస్తున్నారు.
ఈసారి కార్మికులకు లాభాల వాటా ఎంత శాతం చెల్లిస్తారనేది సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 22 లేదా 23 శాతం వాటా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోం ది. సింగరేణిలో లాభాల వాటాను చెల్లిస్తున్న 1999-2000 సంవత్సరం నుంచి పరిశీలిస్తే 2014-15 ఆర్థిక సంవత్సరంలో సాధించినవే అధిక లాభాలుగా చెప్పవచ్చు.గత ఆర్థికసంవత్సరంతో పోల్చితే 17.50 శాతం అధికం.