రెండో భర్తే హంతకుడు
కోలారు: కర్ణాటకలోని కోలారు నగరానికి చెందిన ఆర్కెస్ట్రా గాయని సునీత హత్య కేసును పోలీసులు 48 గంటలలోనే ఛేదించారు. హతుడు ఆమె రెండవ భర్త మంజునాథ్గా గుర్తించి అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం సునీత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విధితమే.హత్య జరిగిన తీరు..మృతదేహాన్ని తెచ్చిన విధానం విని పోలీసులు గగుర్పాటుకు గురయ్యారు. పోలీసుల కథనం మేరకు..
మంజునాథ్ బెంగళూరులోని ప్రైవేటు ట్రావెల్స్లో పనిచేస్తున్నాడు. మొదటి భర్తనుంచి విడాకులు తీసుకున్న గాయని సునీతను వివాహం చేసుకున్నాడు. వీరు మాలూరులో నివాసం ఉండేంవారు. సునీత మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం పెంచుకున్న మంజునాథ్ ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సునీతను బైక్లో ఎక్కించుకొని భట్రహళ్లి సమీపంలోని తోపులోకి తీసుకెళ్లాడు. ఆమె గొంతుకు వేల్ బిగించి హత్య చేశాడు.
మృతదేహాన్ని వేల్తో నడుముకు కట్టుకొని హారోహళ్లి స్మశానం వద్ద పడవేసి ఉడాయించాడు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానంతో మంజునాథ్ను అదుపులోకి తీసుకొని విచారణచేపట్టగా హత్యోదంతం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచినట్లు పోలీసులు తెలిపారు.