మాకు మద్దతివ్వండి: నితీష్ కుమార్
పాట్నా: బీహార్లోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం జేడీయూ అగ్రనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్కుమార్ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సాయం కోరారు. ఇదే సమయంలో కాంగ్రెస్, సీపీఐ మద్దతు కూడా ఆయన కోరారు. గత నెలలో బీహార్లో జితిన్రాం మంజీ ప్రభుత్వానికి విశ్వాస పరీక్షలో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో గెలుపుకోసం నితీష్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందుకోసం 20 ఏళ్ల తర్వాత లాలూ సాయాన్ని అర్థించారు. మరోవైపు ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు ఇండిపెండెంట్లకు బీజేపీ, జేడీయూ అసమ్మతి వర్గం మద్దతిస్తున్నాయి.
శనివారం పాట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయంలో నితీష్కుమార్ మాట్లాడుతూ.. జితిన్ రాం మంజీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, బీహార్లో ముందస్తు ఎన్నికలు వచ్చేలా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ ఉమ్మడి ప్రత్యర్థి అయిన బీజేపీని అడ్డుకునేందుకు తాను లాలూను సాయం కోరినట్టు తెలిపారు.