మైక్రోసాఫ్ట్ నుంచి రెండు లూమియా ఫోన్లు
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ కంపెనీ ‘లూమియా 640’, ‘లూమియా 640 ఎక్స్ఎల్’ అనే రెండు కొత్త విండోస్ ఫోన్లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ‘లూమియా 640’ ఫోన్ కేవలం ఫ్లిప్కార్ట్లో, ‘లూమియా 640 ఎక్స్ఎల్’ రిటైల్ షాపులలో లభించనున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.11,999గా, రూ.15,799గా ఉన్నాయి. డ్యూయల్ సిమ్, 5 అంగుళాల తెర, 1.2 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 1 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 8 జీబీ ఇంటర్నల్ మెమరి, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు లూమియా 640 సొంతం. లూమియా 640 ఎక్స్ఎల్లో 5.7 అంగుళాల తెర, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.