విద్వేష ప్రచారాలు ఫలించవు: మమత

విద్వేష ప్రచారాలు ఫలించవు: మమత


గంగాసాగర్: తమ ప్రభుత్వంపై విష ప్రచారం మానుకోవాలని ప్రతిపక్ష పార్టీలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. దమ్ముంటే అభివృద్ధి ప్రాతిపదికన పోరు సాగించాలని విపక్షాలకు సవాల్ విసిరారు. గంగాసాగర్ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మమతా బెనర్జీ గురువారం శంకుస్థాపన చేశారు.



ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అందరితో కలిసి ముందుకు సాగుతానని చెప్పారు. తమను వ్యతిరేకించేవారిని దూరంగా ఉంచుతామన్నారు. మతం, కులంతో సంబంధం లేకుండా సర్వధర్మ సమన్యాయం అందించడమే తమ విధానమని మమత స్పష్టం చేశారు. విష, విద్వేష ప్రచారాలు ఫలించవని చెప్పారు. వీటికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top